తెలంగాణకు డేంజర్ బెల్స్: నీటి సంక్షోభం తీవ్రంగా పెరిగింది
తెలంగాణలో నీటి సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ప్రస్తుతం పడుతున్న చిన్న జల్లులు మరియు తుంపిర్లు సరిపోవడం లేదు. కనీసం 20 సెంటీమీటర్ల వర్షపాతం పడితేనే పరిస్థితి కొంతైనా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుత వర్షాలతో వ్యవసాయానికి గానీ, తాగునీటికి గానీ పెద్దగా ప్రయోజనం కలిగే పరిస్థితి కనిపించడం లేదు.
ప్రభుత్వం NDSA అంటే National Dam Safety Authority క్లియరెన్స్ వచ్చే వరకు మోటార్లు ఆన్ చేయబోమని స్పష్టం చేసింది. NDSA ఇప్పటికే మూడు డ్యామ్ల గేట్లు తెరిచి ఉంచాలని, నీటిని నిలువ ఉంచొద్దని సూచించింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ మళ్ళీ NDSA ని సంప్రదించి నీటిని లిఫ్ట్ చేయవచ్చా అని అభిప్రాయం అడగాలని నిర్ణయించే అవకాశం ఉంది.
ప్రభుత్వం తరపు నుంచి తీవ్రమైన పరిస్థితిని వివరిస్తూ NDSA కి విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నిర్ణయంలో రిస్క్ కూడా ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com