యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, పలు ఆదేశాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోది పెవిలియన్లో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో మతాలు కుల సంఘాలకు భూముల కేటాయింపు కోసం స్పష్టమైన పాలసీ రూపొందించాలని సూచించారు. యాదగిరిగుట్టలో భూముల కేటాయింపు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలన్నారు.
కేటాయించిన భూములపై యాజమాన్య హక్కులు ఆలయానికే ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కు మార్కెట్ రేటు ప్రకారం భూమి కేటాయించాలన్నారు. ఆలయ నిర్మాణ లోపాలపై ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి వారంలో వివరాలు సమర్పించాలని చెప్పారు.
గెస్ట్ హౌస్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన వారికి దశలవారీగా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట వద్ద భూసేకరణ కోసం వెంటనే నిధులు మంజూరు చేయాలన్నారు. పర్యాటకాన్ని పెంచేందుకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com