అలంపురం జోగిలాంబ ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట
అలంపురంలోని జోగిలాంబ దేవాలయంలో శ్రీచక్ర మహామేరు యంత్ర ప్రతిష్ట మహోత్సవం జరిగింది. శృంగేరి ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీ స్వామి ఈ యంత్రాన్ని ప్రతిష్టించారు. తొలుత ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు పూజలు చేసి మంగళ హారతి సమర్పించారు.
జోగిలాంబ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ వేడుకలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com