శ్రీహరికోట నుంచి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం రేపు: విక్రమ్-1 ప్రత్యేకతలివే
భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ప్రైవేట్ రాకెట్ ప్రయోగం జరగనుంది. స్కై రూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ను రేపు (శుక్రవారం) ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అనే పేరు పెట్టారు.
విక్రమ్-1 రాకెట్ కార్బన్ కాంపోజిట్ నిర్మాణం కలిగి, బహుళ దశలతో రూపొందించబడింది. స్కై రూట్ అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ సిస్టమ్స్, 3డీ ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన రాకెట్ బూస్టర్లను ఇందులో అమర్చారు. 350 కిలోల వరకు చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని భూ నిమ్న కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం దీనికి ఉంది.
ప్రస్తుతం లాంచ్ ప్యాడ్ వద్ద రాకెట్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. తుది దశ తనిఖీలు కూడా ముగిశాయి. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇదొక కీలక ముందడుగు కానుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com