ప్రైమ్9 ఛైర్మన్ బండి శ్రీనివాస రఘువీర్ దంపతులు తిరుమల శ్రీవారి దర్శనానికి చేరుకున్నారు
ప్రైమ్9 న్యూస్ ఛైర్మన్ బండి శ్రీనివాస రఘువీర్ దంపతులు తిరుపతి చేరుకున్నారు. వారు తిరుపతిలోని గంగమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అలిపిరి వద్ద TTD యాజమాన్యంలోని శ్రీకృష్ణ గోమందిరంలో గోపూజ చేశారు. శ్రీవారి పాదాల చెంత 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు.
అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమల చేరుకున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేసి, రేపు ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com