సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసాయి
సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామి వారి శిష్యబృందం ఈ ఉత్సవాలను నిర్వహించింది.
అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమైన ఉత్సవాలలో దివ్య ప్రబంధ పారాయణలు, మూలమంత్ర హోమాలు, సుదర్శన నారసింహ హవనము జరిగాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
ఆ తర్వాత శ్రీ రాధా రుక్మిణి సమేత పాండురంగ విఠలేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలి ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో ఏకాంత అభిషేకం, తిరువారాధన, ప్రత్యేక తులసి అర్చనలు కూడా జరిగాయి. చివరి రోజు చక్రస్నానంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com