బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక సమావేశం హైదరాబాద్లో ప్రారంభం
బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం సమావేశాలు హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. భారత అధ్యక్షతన జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సును కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ కార్యదర్శి రచనా షా ప్రారంభించారు.
ఆర్థిక స్థిరత్వం, సహకారం, ఆవిష్కరణ, సుస్థిరత అనే థీమ్తో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు, విధాన రూపకర్తలు, నిపుణులు, చట్ట అమలు సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు.
గత జూన్లో వర్చువల్గా జరిగిన తొలి సమావేశం ఫలితాల ఆధారంగా తదుపరి కార్యాచరణను రూపొందించనున్నారు. సరిహద్దులు దాటిన అవినీతిని అరికట్టడం, పాలనలో పారదర్శకత పెంచడం, నేరస్తుల అప్పగింత, ఆచూకి గుర్తించడంలో దేశాల మధ్య సహకారం బలోపేతం చేసుకోవడంపై చర్చించనున్నారు. డిజిటల్ ఆస్తులు, ఫిన్టెక్ రంగాల్లో తలెత్తుతున్న అవినీతి ప్రమాదాలపై అనుభవాలు, ఉత్తమ పద్ధతులను పంచుకోనున్నారు.
రేపు ప్రత్యేక కార్యక్రమంలో ‘ఆవిష్కరణ, సాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పరిపాలన’ అనే అంశంపై చర్చ జరగనుంది. ఈ సమావేశాలు బ్రిక్స్ దేశాల మధ్య అవినీతి రహిత పాలన, సంస్థాగత సామర్థ్య నిర్మాణంలో సహకారాన్ని మరింత పటిష్టం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com