తరిగొప్పుల KGBV లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు... విద్యార్థులకు ప్రత్యేక తరగతి
జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా తరిగొప్పల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు మరియు విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు.
కలెక్టర్ విద్యార్థులకు దాదాపు గంటసేపు English మరియు గణిత సబ్జెక్టులపై ప్రత్యేక తరగతి నిర్వహించారు. గణితంలో సులభ పద్ధతులు మరియు సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే మెలుకవలను వివరించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి mock tests నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.
విద్యార్థుల ఆరోగ్యం మరియు పోషకాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. పాలలో నీళ్లు కలపటం, ఆహార నాణ్యతలో తేడాలు వంటి అంశాలు గమనించినట్లయితే వెంటనే ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. ఫిర్యాదులను గోప్యంగా స్వీకరించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని తమ జీవిత లక్ష్యాలను సాధించాలని, చదువు ద్వారా తమ తల్లిదండ్రులకు సహాయపడవచ్చని కలెక్టర్ విద్యార్థులను ప్రోత్సహించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com