భారత్-ఆఫ్రికా సంబంధాలు వేల ఏళ్ల నాటివి: విదేశాంగ మంత్రి జైశంకర్
భారతదేశం, ఆఫ్రికా ఖండాల మధ్య సంబంధాలు వేల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఆఫ్రికా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1963లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ (OAU) ఏర్పాటును ఈ దినోత్సవం గుర్తు చేస్తుంది. ఆ చారిత్రక మైలురాయి పాన్-ఆఫ్రికనిజం ఆదర్శాలకు, ఆఫ్రికా ప్రజల సామూహిక ఆకాంక్షలకు సంస్థాగత రూపాన్ని ఇచ్చింది.
భారత్-ఆఫ్రికా సంబంధాలు చరిత్రలో చాలా లోతుగా ఉన్నాయని జైశంకర్ వివరించారు. రుతుపవనాల వార్షిక వ్యతిరేఖ దిశ మార్పిడి హిందూ మహాసముద్రం ద్వారా రెండు ఖండాల మధ్య పరస్పర చర్యలకు చారిత్రక ఇంజిన్గా పనిచేసిందని తెలిపారు. భారత ఉపఖండం, ఆఫ్రికా ఖండం మధ్య హిందూ మహాసముద్రం అడ్డుగా కాకుండా వారధిగా ఉందన్నారు. మన పూర్వీకులు వస్తువులే కాకుండా సంస్కృతులు, వంటకాలు, తత్వాలు, నమ్మకాలు, జ్ఞానం, జానపద సాహిత్యం, జీవన విధానాలను కూడా పరస్పరం మార్పిడి చేసుకున్నారు. ఈ రెండు ప్రాంతాల చరిత్ర ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com