హైదరాబాద్ 27°C
అమరావతి 33°C
IST 10:11 AM
ఆదివారం ఆగస్టు 9 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

గిరిజన సంక్షేమంపై దృష్టి సారించాలి: విద్యాసాగర్ రావు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
గిరిజన సంక్షేమంపై దృష్టి సారించాలి: విద్యాసాగర్ రావు
📷 Sora Shimazaki / Pexels
షేర్ కాపీ అయింది ✓

మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గిరిజన సంక్షేమంపై ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాలని కోరారు. అంతర్జాతీయ ఆదివాస దినోత్సవం సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

నిరుద్యోగ గిరిజన యువతకు నైపుణ్య అభివృద్ధి అవకాశాలు కల్పించకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పాలకులు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల్లో ప్రజల హక్కులను, భూమిని, సంస్కృతిని కాపాడాలని పిలుపునిచ్చారు.

ఆదివాసీ ప్రాంతాల్లో దాదాపు 50% భూమిని గిరిజనేతరులు ఆక్రమించారని, కొమరం భీం పోరాటం తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదని అభిప్రాయపడ్డారు.

గిరిజన ఉప ప్రణాళిక నిధుల నుంచి 5% షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాలని, పెసా చట్టాన్ని అమలు చేసి గ్రామసభలకు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ భూసేకరణ, స్థానిక వనరుల నిర్వహణపై పూర్తి అధికారాలు ఇవ్వాలని విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com