TG20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కు వరుసగా ఆరో విజయం
TG20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయ పరంపర కొనసాగింది. కరీంనగర్ డైమండ్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ విజయంతో హైదరాబాద్ Qualifier 1కు అర్హత సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్ డైమండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. చందన్ సహాని 55 బంతుల్లో 90 పరుగులు చేయగా, నారాయణ తేజ 45, హరీష్ 20 పరుగులు జోడించారు. హైదరాబాద్ బౌలర్లు దేవ్ మెహతా, అజయ్ దేవగౌడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తొలి మూడు వికెట్లను 9 పరుగులకే తీశారు. వైష్ణవ రెడ్డి అద్భుతమైన త్రోతో తన్మయ అగ్రవాల్ను రన్ అవుట్ చేశాడు.
లక్ష్య ఛేదనలో హైదరాబాద్ ఓపెనర్ సాయి వికాస్ రెడ్డి 17 బంతుల్లో 36 పరుగులతో దూకుడైన ఆరంభం ఇచ్చాడు. పవర్ప్లేలో జట్టు వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. కెప్టెన్ అభిరత్ రెడ్డి (26) తొలి వికెట్గా నిష్క్రమించగా, వైష్ణవ రెడ్డి ప్రశాంతంగా ఇన్నింగ్స్ నిర్మించాడు. ప్రణవ్ వర్మ 15వ ఓవర్లో వరుస సిక్సర్లు, ఫోర్లతో మ్యాచ్ను హైదరాబాద్ వైపు తిప్పాడు. వైష్ణవ రెడ్డి 42 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచి 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించాడు. 19వ ఓవర్ తొలి బంతిని సిక్సర్గా మలిచి జట్టుకు విజయం అందించాడు.
సాయి వికాస్కు Super Striker of the Match, ప్రణవ్ వర్మకు Game Changer of the Match, వైష్ణవ రెడ్డికి Player of the Match అవార్డులు దక్కాయి. మ్యాచ్ అనంతరం మార్గదర్శి MD శైలజ కిరణ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ సాంబశివరావు, ఇతర అధికారులు జట్టును అభినందించారు. హైదరాబాద్ జట్టు వరుస విజయాలు సాధించడం గర్వంగా ఉందని, ఫైనల్లో చూడాలని రామోజీ గ్రూప్ చైర్మన్ కిరణ్ ఆకాంక్షిస్తున్నట్లు శైలజ కిరణ్ తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com