అరుణాచల్ ప్రదేశ్లో 27 ప్రాంతాలను అధికారికంగా గుర్తించిన భారత్
అరుణాచల్ ప్రదేశ్లో 27 ప్రాంతాలను, వాటి మూల పేర్లతో కేంద్రం సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో చేర్చింది. చైనా ఈ ప్రాంతాన్ని 'జాంగ్నాన్' అని పిలుస్తూ, 2017, 2021, 2023 సంవత్సరాల్లో పలు ప్రాంతాలకు చైనీస్ పేర్లు ఇచ్చింది.
1959లో చైనా దళాలు ప్రవేశించిన లాంగ్జు, ఎగువ సుబన్సిరి జిల్లాలోని మాజా, 1962 యుద్ధం జరిగిన తాగ్లా వంటి చారిత్రక ప్రాంతాలు ఈ గుర్తింపులో ఉన్నాయి. ఆయా ప్రదేశాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, ఖచ్చితమైన గుర్తింపు కోసమే ఈ చర్య తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
అరుణాచల్ ప్రదేశ్ శాశ్వతంగా భారత భూభాగమేనని, దీనిపై ఎలాంటి ప్రయత్నాలు చేసినా వాస్తవం మారదని భారత్ స్పష్టం చేసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com