హైదరాబాద్ 30°C
అమరావతి 34°C
IST 3:37 PM
మంగళవారం ఆగస్టు 4 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం బ్రేకింగ్

కేరళ భారీ వర్షాలు: 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 మంది మృతి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కేరళ భారీ వర్షాలు: 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 మంది మృతి
📷 Kaustav Das / Pexels
షేర్ కాపీ అయింది ✓

కేరళలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. IMD రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. కొట్టాయం, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి నలుగురు చనిపోయారు. వాయనాడులో విద్యుత్ షాక్‌తో ఒకరు మరణించారు. అదూర్మాలలో ఒకరు గల్లంతయ్యారు. కోజికోడ్ సముద్రతీరంలో చిక్కుకుపోయిన 17 మంది మత్స్యకారులను రక్షణ బృందాలు కాపాడాయి.

భారీ వరదలతో కొచ్చి-ధనుష్కోడి జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. కోజికోడ్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. పతనంతిట్ట జిల్లాలో వరద నీరు చుట్టుముట్టడంతో ప్రజలు ఇళ్లల్లో చిక్కుకున్నారు. అలువా శివాలయం వరదలో మునిగింది. ఇడుక్కి రిజర్వాయర్ నీటిమట్టం డేంజర్ లెవెల్ దాటింది.

రాష్ట్రవ్యాప్తంగా 65 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. 1,500 మందికి పైగా ముంపు బాధితులను శిబిరాలకు తరలించారు. చెంగన్నూర్, తమిళనాడులోని సూలూరు నుండి రెండు హెలికాప్టర్లను తిరువనంతపురానికి పంపినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. 14 చేపల వేట పడవలను సహాయక చర్యలకు ఉపయోగిస్తున్నారు. SDRF, ఇతర రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. పతనంతిట్ట మినహా మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులో ఉన్నట్లు CM చెప్పారు.

IMD ప్రకారం, మరో 24 గంటల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com