తెలంగాణ అప్పులపై BRS ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది: పీసీసీ చీఫ్ మహేష్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత BRS ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలుజేసిందని ఆయన ఆరోపించారు. తాము అప్పుల లెక్కలు చూపిస్తుంటే BRS నేతలు హరీశ్ రావు, కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
అప్పుల కారణంగా ఓటర్లు BRSను ఎన్నికల్లో గద్దె దింపారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు.
క్యాబినెట్ విస్తరణపై మాట్లాడుతూ, ప్రస్తుతం రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని, వాటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్తో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు విషయంలో స్థానిక నేతలను సంప్రదించి ఉండాల్సిందని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com