హైదరాబాద్ 24°C
అమరావతి 28°C
IST 7:45 PM
గురువారం జూలై 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

నీట్ పేపర్ లీక్: 5 నెలల్లో దర్యాప్తు పూర్తి; రాజ్యసభలో పేపర్ లీక్ నిరోధక బిల్లు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నీట్ పేపర్ లీక్: 5 నెలల్లో దర్యాప్తు పూర్తి; రాజ్యసభలో పేపర్ లీక్ నిరోధక బిల్లు
📷 Ryan Thomas / Pexels
షేర్ కాపీ అయింది ✓

నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేపట్టింది. ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో తెలిపారు. కొత్త చట్టం ప్రకారం ఈ దర్యాప్తు జరుగుతోందని, ఐదు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు.

ఇవాళ రాజ్యసభలో జితేంద్ర సింగ్ యాంటీ పేపర్ లీగ్ బిల్లును ప్రవేశపెట్టారు. నిన్న లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. పేపర్ లీక్లను ప్రభుత్వం సహించబోదని, అందుకే ఈ బిల్లును తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి ఆలస్యం చేయలేదని మంత్రి తెలిపారు. ఈ చట్టం విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు.

2024లో నీట్ యూజీ పేపర్ లీక్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పలు రాష్ట్రాల్లో పోలీసులు, సీబీఐ ఉమ్మడి దర్యాప్తు చేపట్టిన ఈ కేసులో అనేక మంది నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com