పూరీ జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాల ప్రత్యేకతలు
పూరీ జగన్నాథ ఆలయంలో 22 మెట్లు, 22 తత్వాలకి సంకేతంగా ఉంటాయి. ఆలయానికి నాలుగు ద్వారాలు ఉండి, ఒక్కో ద్వారం ఒక్కో పురుషార్థాన్ని సూచిస్తుంది.
తూర్పు ద్వారాన్ని సింహద్వారం అంటారు. ఇక్కడ రెండు సింహాలు ఉంటాయి. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఆలయ శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం నగరంలో ఎక్కడి నుంచి చూసినా సమీపంగా కనిపిస్తుంది.
ఉత్తర ద్వారం హస్తిద్వారం. ఇక్కడ ఏనుగులు ఉంటాయి. ఈ మార్గం నుంచి ప్రవేశిస్తే అర్థం, అంటే సుఖ సంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. పశ్చిమ ద్వారం వ్యాగ్రద్వారం. ఇక్కడ పులి విగ్రహాలు ఉంటాయి. ఈ ద్వారం ధర్మానుష్టానం కోసం ఉద్దేశించబడింది.
దక్షిణ ద్వారం అశ్వద్వారం. ఇందులో రెండు గుర్రాల విగ్రహాలు ఉంటాయి. ఈ మార్గంలో వెళ్తే కామం ఈశ్వర కామంగా మారుతుందని చెప్తారు. భగవంతుడిని తగిన విధంగా కోరుకోవాలనే సందేశం ఇక్కడ ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com