ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన గురుకుల నీట్ ర్యాంకర్లు, అథ్లెట్ సాయి ప్రబలిక
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గురుకుల విద్యార్థులు రాష్ట్ర భవిష్యత్తుకు బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. గురుకులాల్లో చదివి నీట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మంత్రి లక్ష్మణ్తో కలిసి సీఎంను కలిశారు.
ఆసియా అండర్ 23 అత్లెటిక్స్ ఛాంపియన్షిప్ మహిళల రిలే పోటీలో స్వర్ణ పతకం సాధించిన సాయి ప్రబలిక కూడా సీఎంను కలిశారు. ప్రతిభకు పేదరికం ఎప్పుడూ అడ్డంకి కాదని మంత్రి లక్ష్మణ్ అన్నారు. సరైన అవకాశం, నాణ్యమైన విద్య, ప్రభుత్వ అండ ఉంటే గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలోనూ సత్తా చాటగలరని తెలిపారు.
స్వర్ణ పతకం సాధించిన సాయి ప్రబలికను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ గురుకుల విద్యార్థులు రాణించడం తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థ సామర్థ్యానికి నిదర్శనం అన్నారు. భవిష్యత్తులో మరింతమంది ఒలంపియన్లు, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, సివిల్ సర్వెంట్లు ఈ గురుకులాల నుంచి రావాలని ఆకాంక్షించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com