విశాఖ సింహాచలంలో గిరి ప్రదక్షణ ముగింపు; తుదివిడత చందన సమర్పణ
విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలో ఆషాడ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం ముగిసింది. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వామివారికి తుదివిడత చందనాన్ని సమర్పించారు.
సుమారు మూడు మణుగుల సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారైన చందనాన్ని స్వామివారి విగ్రహానికి అలంకరించారు. దీంతో స్వామివారు పూర్తి చందన ధారణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పూర్తిస్థాయి గిరి ప్రదక్షణ చేయలేని భక్తుల కోసం ఆలయంపైనే ప్రత్యేక గుడి ప్రదక్షణ ఏర్పాటు చేశారు. మూడుసార్లు గుడి చుట్టూ తిరిగితే గిరి ప్రదక్షణ చేసిన పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా వచ్చి గోవింద నామస్మరణతో ప్రదక్షణలు నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆలయ అధికారులు కీలక బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరికీ సులువుగా దర్శనం కల్పించేలా అధికారులు పర్యవేక్షించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com