సుప్రీంకోర్టు ఆదేశాలు: రోడ్లపై పాదచారులకు ప్రత్యేక మార్గం తప్పనిసరి
రోడ్లపై నడిచే వ్యక్తులకు ప్రత్యేకమైన సురక్షిత నడక మార్గం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పాదచారులు రోడ్లపై నడవడం వారి ప్రాథమిక హక్కుల్లో భాగమని కోర్టు స్పష్టం చేసింది.
ప్రతి రహదారి పక్కన ఆక్రమణలు లేని స్థలాన్ని పాదచారుల కోసం కేటాయించాలని ఆదేశించింది. మోటారు వాహనాలు ప్రయాణించే ప్రదేశానికి, పాదచారుల మార్గానికి మధ్య స్పష్టమైన విభజన ఉండాలని సూచించింది. ప్రత్యేక ఫుట్పాత్ నిర్మించడం సాధ్యం కాని చోట, రోడ్డుకు, నడక ప్రాంతానికి మధ్య తాడుతో కనీసం విభజన ఏర్పాటు చేయాలని పేర్కొంది.
రోడ్ల పక్కన ఉన్న ఖాళీ స్థలం తమ కోసమేనని, వాహనాల బెడద లేకుండా స్వేచ్ఛగా నడవొచ్చనే నమ్మకం ప్రజలకు కలగాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పాదచారుల కోసం తీసుకునే చర్యలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించిన కోర్టు, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com