శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో టీడీపీ నేత జన్మదిన వేడుకలు; TTD విజిలెన్స్ దర్యాప్తు
తిరుపతి జిల్లా నాగలాపురంలోని టిటిడి ఆధీనంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో ఓ టీడీపీ నాయకుడు తన జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నాడు.
సురుటుపల్లి పల్లికొండేశ్వర స్వామి దేవాలయ బోర్డు సభ్యుడు నెల్సన్ మండేలా అనుచరులతో కలిసి ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి, నోట్లు చల్లుకున్నారనే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటన ఆలయ పవిత్రతకు భంగం కలిగించిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిటిడి వెంటనే స్పందించి, విజిలెన్స్ అధికారులచే దర్యాప్తు ప్రారంభించింది.
ఆలయంలో విధుల్లో ఉన్న సిబ్బందికి వివరణ నోటీసులు జారీ చేసినట్లు, బాధ్యతా రహితంగా వ్యవహరించిన సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని టిటిడి తెలిపింది. బోర్డు సభ్యుడిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com