వారాహి నవరాత్రులు: ఆషాడ మాసంలో సాయంత్రం వారాహి దేవి ఆరాధన
ఆషాడ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులు ప్రత్యేకించి వారాహి దేవిని ఆరాధించే సమయం. వారాహి దేవి మహాలక్ష్మీదేవి అవతారంగా భక్తుల కోరికలు తీర్చడానికి అవతరించిందని శాస్త్రాలు వివరిస్తున్నాయి.
ఈ దేవత సకల దేవతా సైన్యాలకు అధ్యక్షురాలు. ఉగ్ర రూపం కలిగిన ఈ అమ్మవారు రాత్రిపూట మాత్రమే భక్తులను అనుగ్రహిస్తుందని నమ్ముతారు. సూర్యాస్తమయం తర్వాత అమ్మవారి పూజ మొదలుపెట్టాలి. ఎందుకంటే పగటిపూట ఆమె ధ్యానంలో ఉండి తన శక్తిని పెంచుకుంటుంది.
పూజావిధానం ఇలా ఉండాలి: ఒక దీపం వెలిగించి, అమ్మవారికి ఒక మాల సమర్పించాలి. వీలైతే వారాహి అష్టోత్తరం చదవాలి. సమయం లేకపోతే 'ఓం శ్రీ వారాహి దేవతాయై నమః' అని జపిస్తే సరిపోతుంది. నిష్టతో పూజిస్తే త్వరగా కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com