అనంతపురం జిల్లాలో అరటి తోటలో 15 అడుగుల కొండచిలువ కలకలం
అనంతపురం జిల్లా ఎళ్లనూరు మండలం దంతలపల్లిలో అరటి తోటలో 15 అడుగుల కొండచిలువ కనిపించింది. కూలీలు పనులు చేస్తుండగా భారీ పామును చూసి భయాందోళనకు గురై పనులు నిలిపివేశారు.
సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మధుసూదన్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం అటవీ శాఖ నిబంధనల ప్రకారం సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
రైతు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఆరు నెలల క్రితం కూడా ఇదే తోటలో కొండచిలువ కనిపించి దాన్ని వెంటాడి పక్కకు తోలామని, మూడు రోజుల కిందట మరో పాము కనిపించిందని చెప్పారు. రోజురోజుకు సర్పాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com