వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే ఏడు సూపర్ ఫుడ్స్
వర్షాకాలంలో వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు, తేమ రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. దీనివల్ల జలుబు, ఫ్లూ, జీర్ణకోశ సమస్యలు వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కానీ కొన్ని పోషకమైన ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇందులో ఉండే జింజేరాల్ సమ్మేళనం వాపును, ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతుంది. పాలల్లో, కూరల్లో, సూప్లలో పసుపు వేసుకొని తీసుకోవచ్చు.
వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉండి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాల పనితీరుకు కీలకం.
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి గట్ హెల్త్ను మెరుగుపరచి యాంటీబాడీల ఉత్పత్తికి సహాయపడతాయి. గ్రీన్ టీలో ఫ్లెవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు, ఎపిగాలో కార్టిచిన్ గాలెట్లు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. రోజుకు రెండు మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం మంచిది. బాదంలో విటమిన్ ఈ లభిస్తుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్ కావడంతో శరీరంలోని ఆరోగ్యకరమైన కొవ్వుతో పాటు శోషించబడుతుంది. రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి విటమిన్ ఈ అవసరం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com