హైదరాబాద్ 28°C
అమరావతి 32°C
IST 11:15 AM
శుక్రవారం ఆగస్టు 7 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌పై ఏసీబీ సోదాలు : రూ.2.80 కోట్ల ఆస్తులు గుర్తింపు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌పై ఏసీబీ సోదాలు : రూ.2.80 కోట్ల ఆస్తులు గుర్తింపు
📷 Sandeep Kashyap / Pexels
షేర్ కాపీ అయింది ✓

నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే గోపాలరావు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. కర్నూలు ఏసీబీ డీఎస్పీ సీతారామరావు నేతృత్వంలో అధికారులు శుక్రవారం ఏకకాలంలో 6 చోట్ల సోదాలు నిర్వహించారు.

గోపాలరావు కర్నూలు బాలాజీ నగర్‌లోని తన నివాసం, ఉంచాల రోడ్డులోని మరో ఇల్లు, పెద్దపాడు మైత్రి హోం, ఆయన ఐదుగురు బంధువుల ఇళ్లు, కార్యాలయంతో సహా విస్తృతంగా సోదాలు చేపట్టారు. సోదాల్లో 3 విలాసవంతమైన భవనాలు, 5 ఖాళీ స్థలాలు, ఒక కారు గుర్తించామని డీఎస్పీ చెప్పారు. ఈ ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.2.80 కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు.

గోపాలరావుపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి, కర్నూలు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ పొందినట్లు డీఎస్పీ వివరించారు. ప్రస్తుతం బ్యాంకు లాకర్లు, బంగారం, వెండి ఆభరణాల కోసం సోదాలు కొనసాగుతున్నాయి. దర్యాప్తు పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com