అఖండ గోదావరి ప్రాజెక్ట్ పనుల నాణ్యతపై ఆందోళనలు
రాజమండ్రిలో గోదావరి మహా పుష్కరాల కోసం చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్ట్ పనుల నాణ్యతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ₹94 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోంది.
ఇందులో ₹8 కోట్లతో river front అభివృద్ధి, ₹12 కోట్లతో పుష్కర్ ఘాట్ అభివృద్ధి పనులు ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి. అయితే irrigation, municipal ఇంజనీర్ల పర్యవేక్షణ సరిగా లేదని విమర్శలు వస్తున్నాయి.
పుష్కర్ ఘాట్లో marble tiles వేస్తే భక్తులు జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు చెప్తున్నారు. ఘాట్ వద్ద అడుగు భాగంలో నాచి పట్టడం వల్ల యాత్రికులు పడిపోయిన సంఘటనలు జరిగాయని స్థానికులు తెలిపారు. ఘాట్లో అధిక నిర్మాణాలు చేపట్టడంతో స్నాన ప్రాంతం ఇరుకుగా మారిందని కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.
కడియం ప్రాంతంలో చేపట్టాల్సిన అఖండ గోదావరి ప్రాజెక్ట్ పనులు ఇంకా మొదలు కాలేదు. పుష్కరాల నాటికి పనులు పూర్తవుతాయా అనే సందేహాలు స్థానికుల్లో ఉన్నాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు రాజమండ్రి పర్యటనకు వస్తున్నారు. ఒక సంవత్సరం క్రితం ఆయనే ఈ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. పనుల పురోగతిని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com