అమలాపురంలో యువతి అబార్షన్ కేసు: ఆసుపత్రిలో ప్రత్యేక కమిటీ తనిఖీలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్లో యువతి అబార్షన్ కేసుపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక విచారణ బృందం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసింది.
ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవల రికార్డులను అధికారులు పరిశీలించారు. డాక్టర్ శిరీషతో విచారణ జరిపారు. పూర్తి నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై మాట్లాడిన విచారణ కమిటీ సభ్యుడు, గతంలో 26వ తేదీన ఓ యువతికి అబార్షన్ జరిగిందని, ఫిర్యాదుల మేరకు విచారణ ప్రారంభించామని చెప్పారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీవో, డీసీహెచ్ఎస్, డీఎమ్అండ్హెచ్వో, అడిషనల్ డీఎమ్అండ్హెచ్వో, తాను సహా కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు.
అబార్షన్ చేసిన డాక్టర్ లంకే శిరీష కూడా ఈ విచారణలో ఉన్నారని ఆ అధికారి చెప్పారు. నగరానికి చెందిన యువతి ఈ ఆసుపత్రిలో చికిత్సకు వచ్చిందని, అనంతరం వచ్చిన ఫిర్యాదుతో ప్రాథమిక విచారణ జరిపామన్నారు.
ఇప్పుడు వివరాలతో పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని, హాస్పిటల్ రికార్డులు, డాక్టర్ వివరాలు, స్కానింగ్ వివరాలు, తల్లిదండ్రుల విచారణ ఇంకా పూర్తి కావాల్సి ఉందని, పూర్తి వివరాలు వెలువడతాయని ఆయన వివరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com