హైదరాబాద్ 28°C
అమరావతి 32°C
IST 11:20 AM
శనివారం ఆగస్టు 8 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, కీలక శాఖలకు కొత్త కార్యదర్శులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, కీలక శాఖలకు కొత్త కార్యదర్శులు
📷 Yogendra Singh / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పాఠశాల విద్య, రవాణా, పర్యాటకం, గృహ నిర్మాణం వంటి కీలక శాఖలకు కొత్త కార్యదర్శులను నియమించింది.

పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా జె. శ్యాములారావును నియమించారు. ఆయన స్థానంలో ఉన్న కోనా శశిధర్ను రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ను పర్యాటక, సాంస్కృతిక శాఖకు బదిలీ చేశారు. ఆయనకు క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.

గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి బాధ్యతల నుంచి జి. వీరపాండ్యను తప్పించారు. ఆ స్థానంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ను నియమించారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ను బదిలీ చేసి, సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ను నియమించారు.

దీర్ఘకాలంగా సెలవులో ఉన్న ఆమ్రపల్లిని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ పోస్టు నుంచి తప్పించారు. ఆమెను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పట్టంశెట్టి రవి సుభాష్ను నియమించారు. చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ను ముఖ్యమంత్రి కార్యాలయంలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com