ఏపీలో 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ — ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్లో వేడిమి తీవ్రమవుతోంది. వాతావరణ శాఖ 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
విజయనగరం, మార్కాపురం జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా. శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు Orange అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. 13 జిల్లాలకు Yellow అలర్ట్ కూడా జారీ అయింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com