వివాహ వార్షికోత్సవంలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు.
ఆలయంలో రంగనాయక మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి, ఆయనకు పట్టు వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, 43 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన వివాహం జరిగిందని, ప్రతి ఏడాది ఆ రోజున తిరుమల వచ్చి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
స్వామివారిని రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆరోగ్యం, ధైర్యం కల్పించాలని, తన తర్వాత తన కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com