పెండింగ్లో ఉన్న ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ఆయన సమీక్షించారు.
జిల్లా స్థాయిలో ఎంతవరకు చేయగలరో చేయాలని, కుదరని పక్షంలో ఆ అంశాలను క్యాబినెట్ ముందుకు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ల నుంచి ఇలాంటి కేసుల వివరాలు సేకరించాలని సూచించారు.
'ఏదో ఒక సాకు చూపించి ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణను పెండింగ్లో పెట్టే విధానానికి పూర్తిగా స్టాప్ పెట్టాలి' అని సీఎం స్పష్టం చేశారు. ఎలాంటి వివాదాలు లేని, క్రమబద్ధీకరించదగిన స్థలాల జాబితాలను కలెక్టర్లు జిల్లాల వారీగా సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రతి క్యాబినెట్ సమావేశంలో ఇలాంటి స్థలాలను ఆమోదం కోసం ప్రతిపాదించాలని సీఎం సూచించారు. ఇంకా పెండింగ్లో ఉన్న కేసులను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించాలన్నారు. గృహ నిర్మాణ శాఖ పరిధిలోని పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కూడా ఆదేశించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com