గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
AP CM చంద్రబాబు నాయుడు 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
పుష్కరాలను ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యం ఇచ్చి నిర్వహించాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని CM తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పుష్కరాల కన్నా ముందే పూర్తి చేస్తామని, ప్రాజెక్ట్ సందర్శకులకు ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు.
ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు రహదారిని ‘అఖండ గోదావరి’గా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. గోదావరి గట్టు బ్యూటిఫికేషన్, రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.
పుష్కరాలకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, పీఠాధిపతులు, సినిమా ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. జూన్ 24 నాటికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com