హైదరాబాద్ 29°C
అమరావతి 33°C
IST 6:22 PM
మంగళవారం ఆగస్టు 11 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

డీజిల్‌లో ఇథనాల్ కలపడంపై నో చెప్పిన ప్రభుత్వం.. ఐసోబ్యూటినాల్ వైపు దృష్టి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
డీజిల్‌లో ఇథనాల్ కలపడంపై నో చెప్పిన ప్రభుత్వం.. ఐసోబ్యూటినాల్ వైపు దృష్టి
📷 Ranjeet Chauhan / Pexels
షేర్ కాపీ అయింది ✓

దేశంలో డీజిల్ వాహనాల యజమానులకు ఊరట కలిగించే వార్త. డీజిల్‌లో ఇథనాల్ కలపడాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ప్రభుత్వ నిర్వహించిన పరీక్షల్లో, డీజిల్‌తో ఇథనాల్ కలిపితే దాని ఫ్లాష్ పాయింట్ గణనీయంగా పడిపోతున్నట్లు తేలింది. ఫలితంగా, ఆ ఇంధనం నిల్వ చేయడం, రవాణా చేయడం సురక్షితమైన ప్రమాణాలను అందుకోవడం లేదు. అంతేకాకుండా, ఇథనాల్, డీజిల్ సహజంగా కలవవు. కొంత సమయం తర్వాత అవి విడిపోతాయి. ఈ నేపథ్యంలో, డీజిల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రభుత్వం పూర్తిగా విరమించుకుంది.

ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఐసోబ్యూటినాల్‌పై దృష్టి పెట్టింది. 2027 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 2% ఐసోబ్యూటినాల్ డీజిల్ బ్లెండ్‌తో పైలట్ ట్రయల్ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక పరీక్షల్లో ఈ మిశ్రమం స్థిరంగా ఉండటమే కాకుండా, ఉద్గారాలను తగ్గించి, ఇంధన సామర్థ్యంపై స్వల్ప ప్రభావం మాత్రమే చూపుతున్నట్లు వెల్లడైంది.

గతంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. అయితే, డీజిల్‌ విషయంలో భద్రతా సమస్యలే అడ్డంకిగా నిలిచాయి. డీజిల్‌ ఇంజిన్లు, ఇంధన నిల్వ వ్యవస్థలు భిన్నంగా ఉండటంతో, ప్రత్యేక ప్రమాణాలు అవసరమవుతాయి. ఈ నిర్ణయం వల్ల డీజిల్ వాహనదారులపై పెట్రోల్ మాదిరిగా ఇథనాల్ మిశ్రమం వల్ల వచ్చే ధరల ఒడిదుడుకులు లేదా మైలేజీ సమస్యలు ఉండవని భావిస్తున్నారు. ఐసోబ్యూటినాల్‌ ట్రయల్ విజయవంతమైతే, స్వచ్ఛమైన డీజిల్‌కు ఓ పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయం అందుబాటులోకి రానుంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com