హైదరాబాద్ 24°C
అమరావతి 29°C
IST 7:02 PM
బుధవారం జూలై 29 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సాంకేతిక

2028 నాటికి విద్యుత్ ఎయిర్ అంబులెన్స్: IIT మద్రాస్ స్టార్టప్ అభివృద్ధి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
2028 నాటికి విద్యుత్ ఎయిర్ అంబులెన్స్: IIT మద్రాస్ స్టార్టప్ అభివృద్ధి
📷 Daniil Komov / Pexels
షేర్ కాపీ అయింది ✓

నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని అత్యవసర రోగులు ఆస్పత్రికి చేరడం ఆలస్యమయ్యే సమస్యకు పరిష్కారంగా విద్యుత్ ఎయిర్ అంబులెన్స్ రూపొందుతోంది. ఐఐటి మద్రాస్ ప్రోత్సాహంతో ‘ది ఈప్లేన్’ కంపెనీ స్టార్టప్ దీనిని రూపకల్పన చేస్తోంది.

ఐఐటి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి నేతృత్వంలోని బృందం ఈ విద్యుత్ విమానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అనుమతులు లభించాయి. ప్రస్తుతం ఐఐటి తయ్యూర్ క్యాంపస్‌లో ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయి.

ఈ ఎయిర్ అంబులెన్స్ నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలదు. హెలిపాడ్ అవసరం లేకుండా భవనాల పైకప్పులపై కేవలం 5000 చదరపు అడుగుల స్థలంలో ల్యాండ్ అవుతుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 750 కిలోల లిథియం-అయోడిన్ బ్యాటరీతో పనిచేస్తుంది. పైలట్‌తో పాటు రోగి, నర్సును తీసుకెళ్లేలా డిజైన్ చేశారు.

హెలికాప్టర్ అంబులెన్స్‌తో పోలిస్తే విద్యుత్‌తో నడవడం వల్ల నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని డెవలపర్లు తెలిపారు. అలాగే ఒక పైలట్, ఇద్దరు ప్రయాణికులతో ఎయిర్ టాక్సీ సర్వీస్ కూడా తయారవుతోంది. అన్ని అనుమతులు పూర్తయితే 2028 నాటికి ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ అంబులెన్స్ వాణిజ్య సేవలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com