ఇంద్రకిలాద్రిపై లడ్డుపోటు, అన్నప్రసాద భవనాల నిర్మాణ పనుల పరిశీలన
విజయవాడ ఇంద్రకిలాద్రిపై నిర్మాణంలో ఉన్న లడ్డు పోటు, అన్నప్రసాద భవనాల పనుల పురోగతిని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ గురువారం పరిశీలించారు. నూతన లడ్డుపోటు భవనం నాణ్యత, విద్యుదీకరణ, అన్నప్రసాద భవనంలో భోజనం కోసం చేపట్టిన మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడిన కమిషనర్, పనులు సంతృప్తికరంగా వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే ఆగస్టు 15లోపు సివిల్ ఇంజనీరింగ్, తుది మెరుగుల పనులన్నీ పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించినట్లు వెల్లడించారు. నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడవద్దని స్పష్టం చేశారు.
దసరా నవరాత్రులను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను త్వరగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందని గతంలోనే ఈవో, ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. 15 రోజుల క్రితం పరిశీలించినప్పటి కంటే ఇప్పుడు పనుల ప్రగతి మెరుగ్గా ఉందని కమిషనర్ అభిప్రాయపడ్డారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com