యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ 3లో అగ్ని ప్రమాదం
నల్గొండ జిల్లా వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ 3లో అగ్ని ప్రమాదం జరిగింది. టర్బైన్ డ్రైవన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఆయిల్ లీకేజ్, short circuit కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగలు ఆవరించాయి. plant లోని fire safety వ్యవస్థ సహాయంతో అధికారులు, సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రధాన యంత్రాలకు నష్టం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
ప్రమాదంలో control cables, valves దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది. మంటలు పూర్తిగా ఆరిన తర్వాత అధికారులు పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తారు.
యూనిట్ 3లో విద్యుత్ ఉత్పత్తిని కొద్ది రోజుల క్రితమే అనధికారికంగా ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ ప్రమాదం జరిగింది. గత ఏడాది అదే మే నెలలో యూనిట్ 1లో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఆ యూనిట్ కూడా ప్రారంభించిన కొద్ది రోజులకే ప్రమాదం చోటు చేసుకుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com