అరుణాచల్ప్రదేశ్లో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఇళ్లు, ముగ్గురు గల్లంతు
అరుణాచల్ ప్రదేశ్లోని లోయర్ సుబన్సిరి, పపుమ్ పరే జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య మూడు గంటల్లోనే 72.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. కొండల నుంచి వచ్చిన వరద నీరు యాజాల సర్కిల్లోని నిప్కోబ్ పవర్ ప్రాజెక్ట్ కాలనీపైకి దూసుకువచ్చింది.
నిర్మాణంలో ఉన్న భారీ రిటైనింగ్ వాల్ వరద ఉద్ధృతికి తట్టుకోలేక కూలిపోయింది. క్వార్టర్స్లోకి నీరు చేరి 18 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.
ప్రాజెక్ట్కు చెందిన హెలిపాడ్ ధ్వంసమైంది. యాజాలిని కలిపే ప్రధాన హైవే బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది, దీంతో ఆ ప్రాంతం బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండ చరియలు విరిగిపడడంతో రహదారులు మూసుకుపోయాయి. దర్యాప్తు కోసం వెళ్లిన టెక్నికల్ టీమ్స్, ఓ జియాలజిస్ట్, వందలాది మంది ప్రయాణికులు కొండల మధ్య చిక్కుకుపోయారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com