బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి
భారతదేశంలో బంగారం, వెండి ధరలు నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్ తాజా సమాచారం ప్రకారం ధరలు రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి.
24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు ₹49 పెరిగింది. ప్రస్తుతం గ్రాము ధర ₹15,999 గా ఉంది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ₹1,60,000 మార్కుకు చేరువలో ఉంది.
ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹45 పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ గ్రాము ధర ₹14,660 గా ఉంది. 18 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹37 పెరిగి ₹11,995 కు చేరింది.
వెండి ధరలు కూడా పెరిగాయి. గ్రాము వెండి ₹5 పెరిగి ₹290 కు చేరింది. కిలో వెండి ధర ₹5,000 పెరిగి ₹2,90,000 కు చేరింది.
పెళ్లిల సీజన్ నడుస్తున్న సమయంలో ఈ ధరల పెరుగుదల కొనుగోలుదారులపై అదనపు భారం మోపుతోంది. Global market లో డిమాండ్ పెరగడం, ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com