జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు: పలు గ్రామాల్లో ఇళ్లల్లోకి వరద నీరు
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాలు జలమయమయ్యాయి.
రామనూర్, కుమ్మరిపల్లి, జగదేవపేట, స్తంభంపల్లి గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వస్తువులు తడిసి నష్టం జరిగింది. కాలనీ రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది.
స్తంభంపల్లి చెరువు నిండుకుండలా మారగా, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com