జనసేన కార్యకర్త ఇల్లు కూల్చివేత వివాదం మళ్లీ వేడెక్కింది
కొబ్బరి తోట ప్రాంతంలో జనసేన కార్యకర్త వెంకటాచలం ఇల్లు కూల్చివేసిన వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై DISHA సమావేశంలో MP బాలశౌరి మున్సిపల్ కమిషనర్ బాపిరాజును నిలదీశారు.
ఎవరి ఆదేశాలతో ఆ ఇల్లు కూల్చారో చెప్పాలని MP కోరారు. దీనిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యాఖ్యలపై భూ వివాదంలోని మరో వర్గం నేత కొండపల్లి రామానుజరావు తీవ్రంగా స్పందించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రైవేట్ భూ వివాదంలో MP జోక్యం ఎందుకని ప్రశ్నించారు.
రామానుజరావు వివరించిన వాస్తవాల ప్రకారం — తమ భూమిలో వెంకటాచలం అనే వ్యక్తి అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారు. దీంతో తాము కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకే మున్సిపల్ అధికారులు ఆ నిర్మాణాన్ని తొలగించారని ఆయన చెప్పారు.
నిర్మాణం ప్రారంభం నుండి ప్రతి దశలోనూ Joint Collector, Collector కు విషయం తెలియజేశామని, కోర్టు తీర్పు వచ్చేవరకు నిర్మాణం చేయొద్దని పెద్దమనుషుల సమక్షంలో ఒప్పందం కుదిరిందని రామానుజరావు తెలిపారు. ఈ విషయంపై MP బాలశౌరి స్పందన తెలియాల్సి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com