తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్కు ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బండ్లగూడా జాగీర్లోని తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో జరిగిన దిక్షాంత్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరు నెలల పాటు కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న 117 మంది అధికారులు ఈ పరేడ్లో పాల్గొన్నారు.
వీరిలో 33 మంది మహిళా అధికారులు, 84 మంది పురుష అధికారులు ఉన్నారు. 24 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 89 మంది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు కొత్తగా విధుల్లో చేరనున్నారు.
ఈ సందర్భంగా నూతన అధికారులకు మంత్రి జూపల్లి దిశా నిర్దేశం చేశారు. యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన అన్నారు. చట్ట విరుద్ధంగా డ్రగ్స్, గంజాయి విక్రయాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com