కోనసీమ జిల్లాలో ట్రస్ట్ ఆధ్వర్యంలో పెన్షన్లు, నోట్బుక్స్ పంపిణీ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదిరి మండలం మగటపల్లి గ్రామంలో సత్యసాగర మాణిక్యాంబ కాపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెన్షన్లు, నోట్బుక్స్ పంపిణీ చేశారు.
గురుపౌర్ణిమ సందర్భంగా గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో 25 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నెలకు రూ.1000 చొప్పున పెన్షన్ ఇచ్చారు. ట్రస్ట్ చైర్మన్ బొలిశెట్టి నరసింహరావు (తాతాలు) హైదరాబాద్ నుంచి వచ్చి ఈ సాయం అందించారు.
అనంతరం మగటపల్లి నామన రామానుజమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థులకు కావలసిన నోట్బుక్స్లను ట్రస్ట్ ద్వారా పంపిణీ చేశారు. ఈ ట్రస్ట్ 2025 మార్చి 30న ప్రారంభమైంది. అప్పటి నుంచి జిల్లాలోని 55-56 మంది లబ్ధిదారులకు ప్రతి నెల 9వ తేదీన పెన్షన్ ఇస్తున్నారు.
ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సాయం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కొంతమంది పేద విద్యార్థులను దత్తతగా తీసుకొని వారి చదువు పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం అందించాలనే ఆశయం ఉందని పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com