దేవాదాయ శాఖలో జోక్యంపై మంత్రి కొండా సురేఖ ఏఐసీసీకి ఫిర్యాదు; ఎమ్మెల్యే కడియం శ్రీహరితో వివాదం
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఏఐసీసీ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఇరువురి మధ్య వివాదం ముదిరింది.
కడియం శ్రీహరి తన అనుమతి లేకుండా అధికారులతో సమీక్ష నిర్వహించి, ఫొటోలను తన వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారని సురేఖ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఎమ్మెల్యే హోదాలో అధికారులను కలిశానే తప్ప సమీక్ష చేయలేదని శ్రీహరి వివరణ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖది అవగాహనా రాహిత్యమంటూ ఆయన విమర్శించారు.
శ్రీహరి వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే అసెంబ్లీ స్పీకర్ను కలిశారని ఆరోపించారు. పార్టీ మారిన రోజే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాలు చేశారు.
కొండా సురేఖ, కడియం శ్రీహరి ఇద్దరూ గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరూ కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. శ్రీహరి తన కూతురు కు కాంగ్రెస్ బి ఫామ్ తీసుకొని ఎంపీ గెలిపించుకున్నారు. ఈ వివాదంతో కాంగ్రెస్ శ్రేణులు రెండుగా చీలిపోయాయి.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇరువర్గాలతో మాట్లాడి వివాదాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా, ఆ తర్వాత బహిరంగ విమర్శలు కొనసాగాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ వైరం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం జోక్యం ఎప్పుడు ఉంటుందనేది గమనించాల్సి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com