హైదరాబాద్ 25°C
అమరావతి 28°C
IST 8:56 AM
మంగళవారం జూలై 28 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

కొండకర్ల ఆవ ఎకో టూరిజం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం దృష్టి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కొండకర్ల ఆవ ఎకో టూరిజం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం దృష్టి
📷 Ready 2 Release / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ మంచినీటి సరస్సు కొండకర్ల ఆవను ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఇటీవల ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972 కింద కొండకర్ల ఆవను రక్షిత ప్రాంతంగా గుర్తించినట్లు తెలిపారు. ఆక్రమణల నుంచి ఆవను కాపాడేందుకు ప్రభుత్వం దీనిని కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించిందని చెప్పారు. చిత్తడి నేలల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆవను సమగ్ర సర్వే చేసి జలవనరుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పర్యావరణ హిత ఎకో టూరిజం అవకాశాలపై అధ్యయనం చేసి ప్రాజెక్టు రూపొందించాలని సూచించారు. స్థానికులకు ఉపాధి, ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పర్యాటక రంగాన్ని విస్తరించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com