KTR: 2027లో పాదయాత్ర చేస్తా.. పార్టీ నిర్ణయమే ఫైనల్
BRS నేత, మాజీ మంత్రి కేటీఆర్ 2027లో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. పార్టీలోని పెద్దలతో చర్చించి రూట్, సమయం, ఎక్కడి నుంచి ఎక్కడికి అనే వివరాలు నిర్ణయిస్తామని తెలిపారు.
పాదయాత్రకు ముందు తాను ఫిట్గా మారడానికి ప్రయత్నిస్తున్నానని, వచ్చే ఏడాది నుంచే పాదయాత్ర మొదలుపెడతానని, పూర్తిస్థాయి యాత్ర 2027లో ఉంటుందని ఆయన వివరించారు. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుందని, కానీ 2027లో డెఫినెట్గా పాదయాత్ర చేస్తానని చెప్పారు.
యువతలో ప్రభుత్వాలపై ఉన్న నిరాశ, కోపాన్ని గుర్తించేవారు రాజకీయంగా నెగ్గుతారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఈ నిరాశను ఛానలైజ్ చేసుకోవడంపై ఒక ఉదాహరణగా, తాను గతంలో ప్రస్తావించిన "కాక్రోచ్ జనతా పార్టీ"కి 22 మిలియన్ ఫాలోవర్లు ఉన్నాయని, ఇది భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ అని ఆయన చెప్పారు.
తనను కొందరు అహంకారిగా భావిస్తారన్న ప్రశ్నకు స్పందిస్తూ, తన బాడీ లాంగ్వేజ్, నిజం నిక్కచ్చిగా చెప్పే స్వభావమే దీనికి కారణమని కేటీఆర్ అన్నారు. "కడుపులో కత్తులు పెట్టుకొని పెదవుల మీద చిరునవ్వులు పెట్టుకునే తెలివి తెలంగాణ వానికి ఉండదు" అని ఆయన వ్యాఖ్యానించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com