రాయచోటికి 120 కోట్లతో రెండో తాగునీటి పథకం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి పట్టణంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయచోటి పురపాలక సంఘానికి వెలిగల్లు నుంచి 120 కోట్ల రూపాయలతో రెండో తాగునీటి పథకం తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయని, డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి పనులతో ప్రజల విశ్వాసం సంపాదిస్తున్నామని, ఈ ధైర్యంతోనే మరిన్ని పనులు చేపడతామని ఆయన చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com