విజయవాడలో MDMA డ్రగ్స్ స్వాధీనం: ఇద్దరు అరెస్టు, ప్రధాన నిందితుడు పరారు
విజయవాడలో MDMA మాదక ద్రవ్యం అమ్ముతున్న ఇద్దరు యువకులను task force పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద 6 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు మంగీలాల్, సైతాన్ రాజస్థాన్ వాసులు. ఉపాధి కోసం విజయవాడ వచ్చి శేషసాయి వీధిలో గది అద్దెకు తీసుకున్నారు. ఒక steel దుకాణంలో పని చేస్తూ తర్వాత మానేశారు.
ఇదే రాజస్థాన్కు చెందిన హరీష్ అనే వ్యక్తి వారికి పరిచయమయ్యాడు. హరీష్ బెంగళూరు నుంచి MDMA తెచ్చి విజయవాడలో అమ్మేవాడు. పని మానేసిన మంగీలాల్, సైతాన్లను కూడా drug వ్యాపారంలోకి దించాడు.
మధ్యరాత్రి సమయంలో drug అమ్మడానికి బయటికి వచ్చిన వారిద్దరినీ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణలో సరఫరా హరీష్ ద్వారా జరుగుతోందని తెలిసింది. హరీష్ ప్రస్తుతం పరారులో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
నిందితులను court లో హాజరుపరచగా judicial remand విధించింది. వారిని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరళించారు.
ఈ ఏడాది విజయవాడలో రెండుసార్లు MDMA పట్టుబడింది. రెండు కేసుల్లోనూ మూలాలు బెంగళూరులోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com