పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు: MEA స్పష్టత
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పాస్పోర్ట్ భారత పౌరసత్వానికి నిర్ణయాత్మక రుజువు కాదని, అది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఆన్లైన్లో చర్చకు దారితీసింది. పాస్పోర్ట్తో పాటు ఆధార్, వోటర్ ఐడీ, పాన్ కార్డు, రేషన్ కార్డు వంటి ఏ పత్రం కూడా ఒంటరిగా పౌరసత్వాన్ని రుజువు చేయలేదని MEA తెలిపింది. సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పుల్లో జనన ధృవీకరణ పత్రం మాత్రమే పౌరసత్వానికి ఏకైక రుజువు అని పేర్కొంది. 2024లో సుప్రీంకోర్టు ఒక కేసులో జనన ధృవీకరణ పత్రమే స్వతంత్రంగా పౌరసత్వాన్ని నిరూపించగలదని స్పష్టం చేశారు. 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం జననం, సంతతి, నమోదు, సహజీకరణ అనే నాలుగు మార్గాల ద్వారా మాత్రమే పౌరసత్వం లభిస్తుంది. పాస్పోర్ట్ దిగువన ‘ఈ పత్రం భారత ప్రభుత్వానికి చెందినది’ అని స్పష్టంగా రాయబడి ఉంటుంది; అది వ్యక్తికి సొంతం కాదు. కాబట్టి ప్రయాణానికి, గుర్తింపుకు ఉపయోగించే ఈ పత్రాలు పౌరసత్వానికి రుజువు కాదని, జనన ధృవీకరణ పత్రమే ఈ విషయంలో సరైన దారి అని MEA స్పష్టం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com