భోగాపురం విమానాశ్రయాన్ని రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ; బొత్స వ్యాఖ్యలు
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇది దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో కీలక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ట్వీట్ను షేర్ చేస్తూ, ఉత్తరాంధ్ర టేకాఫ్కు సిద్ధంగా ఉందన్నారు. ప్రధాని మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నామని ఆయన తెలిపారు.
మండలి ప్రతిపక్ష నేత బొత్సా సత్యనారాయణ మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం రావడానికి దివంగత వైఎస్సార్, వైఎస్ జగన్ కారణమని అన్నారు. తాను గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు, విశాఖ విమానాశ్రయం విస్తరణ ప్రతిపాదన వచ్చిన సందర్భంగా భోగాపురం, ఎలమంచిలి దగ్గర స్థలాలు పరిశీలించామని బొత్సా తెలిపారు. ఈ విషయం చంద్రబాబుకు, అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు కూడా తెలుసునని ఆయన చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com