నారాయణ్ఖేడ్లో భర్తను హత్య చేసిన భార్య, ప్రియుడు అరెస్టు
సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్లో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి ఈ నెల 15న కనిపించకుండా పోయాడు. 18న అతని భార్య కల్పన నారాయణ్ఖేడ్ పోలీస్ స్టేషన్లో భర్త మిస్సింగ్ అని ఫిర్యాదు చేసింది.
పోలీసులు కల్పన కాల్ డేటా విశ్లేషించారు. మానూరు మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన పండరి అనే వ్యక్తి ఆమెతో అధికంగా మాట్లాడినట్టు గుర్తించారు. పండరిని విచారించగా అతను హత్యలో తన పాత్ర ఒప్పుకున్నాడు.
దర్యాప్తులో వెలువడిన వివరాల ప్రకారం — కల్పన నర్సుగా పని చేస్తోంది. పండరితో ఆమెకు గత నాలుగేళ్లుగా రహస్య సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 15న కల్పన భర్తను నారాయణ్ఖేడ్లోని ఒక హోటల్కు తీసుకెళ్లింది. అక్కడ ముత్యం రెడ్డికి పండరిని పరిచయం చేసింది. భోజనం బిల్లు ముత్యం రెడ్డే చెల్లించాడు.
భోజనం తర్వాత ముత్యం రెడ్డిని పండరి పొలం దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ ముందే JCB తో తవ్విన గుంత సిద్ధంగా ఉంది. పండరి, అతని అన్న విట్టల్ కలిసి నైలాన్ తాడుతో ముత్యం రెడ్డిని హత్య చేశారు. మృతదేహాన్ని గుంతలో పాతి పెట్టి మట్టితో కప్పేశారు.
పండరి చేసిన కన్ఫెషన్ ఆధారంగా పోలీసులు పొలం వద్దకు వెళ్లారు. MRO, మానూరు తహసీల్దార్ సమక్షంలో గుంత తవ్వి మృతదేహాన్ని వెలికి తీశారు. బంధువులు ఆ మృతదేహం ముత్యం రెడ్డిదని గుర్తించారు. నారాయణ్ఖేడ్ SI శ్రీశైలం మాట్లాడుతూ నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగిస్తారని పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com