NEET పేపర్ లీక్ కేసు: మనీషా మంధారేకు 14 రోజుల CBI కస్టడీ
NEET UG పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితురాలు మనీషా గురునాథ్ మంధారేని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల CBI కస్టడీకి అప్పగించింది.
మహారాష్ట్ర పూణేకు చెందిన మనీషా సీనియర్ బాటనీ లెక్చరర్. National Testing Agency (NTA) ఆమెను నిపుణురాలిగా నియమించింది. దీంతో ఆమెకు NEET పరీక్షకు సంబంధించిన బాటనీ, జువాలజీ ప్రశ్న పత్రాలపై పూర్తి access లభించింది.
లీక్ అయిన ప్రశ్నలను విద్యార్థులకు ముందుగానే చేరవేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని CBI అధికారులు కోర్టుకు తెలిపారు. ఏప్రిల్లో పూణేలోని తన నివాసంలో మంధారే రహస్య coaching క్లాసులు నిర్వహించి లీక్ అయిన ప్రశ్నలకు సమాధానాలు రాయించినట్లు దర్యాప్తులో తేలిందని CBI పేర్కొంది.
NTA లో ప్రశ్న పత్రాల తయారీ నుండి పంపిణీ వరకు జరిగిన మొత్తం ప్రక్రియపై లోతైన దర్యాప్తు జరుగుతుందని CBI కోర్టుకు తెలిపింది. పేపర్ లీక్ వెనక ఉన్న ఆర్థిక నెట్వర్క్ను పూర్తిగా బయటపెట్టాల్సి ఉందని అధికారులు చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com